నేటి దిన పత్రిక సూర్య 18 వ వార్షికోత్సవ వేడుకలుసోమవారం ఘనంగా జరిగాయి. ఎస్.పి.ఆర్. పబ్లికేషన్స్ చీఫ్ అధినేత, ఎడిటర్ నూకారవు పద్మజ హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయం లో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నేటి దినపత్రిక సూర్య ఎడిటర్ నూకారవు పద్మజ మాట్లాడుతూ సూర్య దిన పత్రిక స్థాపించిన తర్వాత తెలుగు పత్రిక రంగంలోనే బడుగుల పక్షాన అక్షర సమరానికి శ్రీకారం చుట్టి సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేయడం జరిగిందన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజలకు ప్రభుత్వానికి నేటి దినపత్రిక సూర్య వారధిగా పనిచేస్తుందన్నారు. 17 ఏళ్లుగా అక్షర ప్రస్థానాన్ని కొనసాగించిన నేటి దినపత్రిక సూర్య 18వ వార్షికోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సూర్య ప్రకటనకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ రామచంద్ర రావు, చెన్నాడి సుశాంత్, తేజస్విని, సీజీఎం రాంబాబు, నెట్ వర్క్ ఇన్ చార్జి భాస్కర్, హెచ్ ఆర్ మేనేజర్ వై. నాగభూషణం, ఫీచర్స్ పేజ్ ఇంచార్జ్ ఎం. రాంగోపాల్, స్టేట్ బ్యూరో రిపోర్టర్లు విద్య వెంకట్, అవధూత రవి, వెబ్ ఇన్ చార్జి అహ్మద్, సత్యనారాయణ, కార్టూనిస్టు నారు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో సైతం నేటి దినపత్రిక సూర్య 18వ వార్షికోత్సవ సందర్భంగా కేక్ కట్ చేశారు.