వికారాబాద్ జిల్లా కొడంగల్ లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తహశీల్దార్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, సీఐ శ్రీధర్ రెడ్డి, ఇరిగేషన్ డిఈఈ కిరణ్ కొడంగల్ శివారులోని గొల్ల కుంటను పరిశీలించారు. నిమజ్జనం జరిగే ప్రాంతంలో తగిన ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వినాయకుల శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు.