గిద్దే గళం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో శుక్రవారం గద్దర్ అవార్డ్స్ మహోత్సవం కళాకారుల ధూంధాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ 33 జిల్లాలకు సంబంధించిన కళాకారులు మేధావులు పాల్గొ న్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన కళాకారుడు శ్రీనివాస్ ధూంధాం కార్యక్రమం పాల్గొని తన ఆటపాటలను గద్దర్ తో పనిచేసిన గుర్తులను యాది చేసుకుంటూ పాటలు పాడారు.
దీంతో గద్దర్ అవార్డును కళాకారుడు శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. ప్రొఫెసర్ కాశీం, బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న, గిద్దే గళం రాంనర్సయ్య చేతుల మీదుగా గద్దర్ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా కళాకారుడు శ్రీనివాస్ మాట్లాడుతూ గద్దర్ అవార్డు రావడం అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.