రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశలు ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ ఎలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో రానున్న 48 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.