ఆడపిల్లలకు సమాజంలోనే కాదు.. సొంతింట్లోనూ రక్షణ లేకుండా పోతుంది. కామంతో కళ్లు మూసుకుపోయి కొందరు కామాంధులు.. ఆప్తులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వావివరసలు మరిచిపోయి మృగంలా తయారవుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ శివారు శంషాబాద్లో దారుణం చోటు చేసుకుంది. తండ్రి తర్వాత తండ్రైన చిన్నాన్నే ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను బెదిరించి అత్యాచారాని పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే. శంషాబాద్కు చెందిన దంపతులు రోజువారీ కూలీలుగా జీవనం సాగించేవారు. అయితే అనారోగ్యం బారిన పడ్డ భర్త రెండు నెలల క్రితం కాలం చేశాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భార్య కుుటంబ పోషణ నిమిత్తమై పనుల కోసం బయటకు వెళ్లింది. దీంతో ఒంటరిగా ఉంటున్న వారి కుమార్తె (14) సొంత బాబాయ్ కన్నేశాడు.. బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ నెల 20న ఈ ఘటన చోటు చేసుకోగా.. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ మియాపూర్లో కన్నతండ్రే కూతుర్ని కాటేశాడు. మద్యానికి బానిసైన తండ్రి.. కుమార్తెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెల్లి అత్యాచార యత్నం చేశాడు. బాలిక గట్టిగా అరవటంతో బండకేసి కొట్టి చంపేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు నాటకం ఆడాడు. చివరకు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.