కారేపల్లి మండల వ్యాప్తంగా ఎక్కడైనా సరే బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజారాం హెచ్చరించారు. శనివారం కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల ప్రకారం మద్యం విక్రయించిన సమాచారం తెలిసిన దాడులు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మద్యం విక్రయిస్తున్న సమాచారాన్ని తమకు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.