గ్రామాలలో బిజెపి నాయకులు కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం ప్రతి బూతులో 370 ఓట్లు వచ్చే విధంగా కృషి చేయాలని జిల్లా అధ్యక్షురాలు అరుణతారా అన్నారు. బుధవారం మద్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కొరకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తుకారం, శ్రీధర్, రాములు సతీష్, బాలకిషన్, పాల్గొన్నారు.