నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం 508 అడుగులకు పడిపోవడంతో జంట నగరాలకు నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా జల మండలి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పుట్టంగండి దిగువన సాగర్ వెనుక జలాలను ఎత్తి పోసేందుకు 10 ఎమర్జెన్సీ మోటార్లను ఏర్పాటు చేస్తుంది. దీంతో సాగర్ జలాశయ నీటిమట్టం 498 నుండి 506 అడుగుల వరకు ఉన్న నీటిని ఎత్తి పొసేందుకు అవకాశం ఉంది. ఇంతకుముందు 2019లో కూడా ఇలాగే నీటిని ఎత్తిపోశారు.