త్రిపురారం మండలం పరిధిలోని రూప్లతండా, హర్జ్యతండాలో శ్రీ వేణుగోపాల స్వామి కోలాట నాట్య బృందం ఉచిత శిక్షణ పొందుతున్నారు. గ్రామానికి చెందిన సామాజిక సేవకులు ఎస్ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ధనావత్ రఘు నాయక్ సహకారంతో మండల మాజీ జడ్పీటీసీ ధన్ సింగ్ నాయక్, తొమ్మిది తండాల నాయక్ భాష కిట్టు నాయక్, యువ నాయకులు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి గజ్జెలు అందజేశారు.