ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటేసిన కిషన్ రెడ్డి దంపతులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 30, 2023, 11:15 AM

హైదరాబాద్ కాచిగూడలోని దీక్ష మోడల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన అంబర్పేట్ నియోజకవర్గం పోలింగ్ కేంద్రంలో గురువారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.
అయితే వచ్చే ఐదేళ్లకు తెలంగాణ ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 7.78శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com