గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఏదైనా రాజకీయ పార్టీ వారు, ఇతర వ్యక్తులు వారికి సంబంధించిన పార్టీకి ఓటు వేయాలని బల్క్ మెసేజ్ లు ద్వారా గాని ఫోన్ కాల్స్ ద్వారా గాని మరె ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా గాని ప్రచారం చేస్తే ఎన్నికల నియమావళి ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.