కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం కామారెడ్డిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరిన కలెక్టర్ సాధారణ ఓటర్ లాగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి, పోలింగ్ సిబ్బందికి కలెక్టర్ పేరు చెప్పి, ఓటర్ కార్డు చూపించి, చూపుడు వెలికి బ్లాక్ ఇంక్ మార్క్ వేసుకున్నారు. అనంతరం పోలింగ్ కౌంటర్ వెళ్లి ఈవిఎంలో తన ఓటును వేయడం జరిగింది. ఓటు వేసిన కలెక్టర్ అక్కడి నుండి వెళ్లిపోయారు.