ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈసారి మహిళల కోసం.. ప్రత్యేక పథకాలు ప్రకటించిన సోనియా గాంధీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 07:53 PM

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి సభలో పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక హామీలు ప్రకటించారు. తెలంగాణలో త్వరలో రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్.. ఆరు గ్యారంటీ పథకాలతో పాటు కీలక హామీలను ఈ సభా వేదికగా ప్రకటించారు. అయితే.. ఇందులో ప్రధానంగా.. మహిళా ఓటర్లే మెయిన్ టార్గెట్‌గా ప్రత్యేక హామీలు ప్రకటించారు సోనియా గాంధీ. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టటం ఖాయమని సోనియా గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అయితే.. అధికారంలోకి వచ్చాక.. ఈ ఆరు గ్యారంటీ పథకాలను రాష్ట్ర ప్రజల అభివృద్ధే లక్ష్యంగా అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలని.. అప్పుడే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమన్నారు. ఇదే తన కోరిక అని సోనియా గాంధీ ప్రకటించారు.


కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెడతామని సోనియా గాంధీ తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ప్రజలను అభివృద్ధి చేయడం కూడా.. రాష్ట్రం ఇచ్చిన వాళ్లుగా తమ మీద బాధ్యత ఉందని తెలిపారు. కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని తెలంగాణ ప్రజలను కోరారు. ఈ క్రమంలోనే.. మహిళల కోసం ప్రత్యేక పథకాలను ప్రకటించారు సోనియా. మహాలక్ష్మి పథకం కిందా.. ప్రతి నెలా 2,500 ఆర్థిక సాయం అందించనున్నామన్నారు. దాంతో పాటుగా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. ఇక మహిళ కోసం ప్రత్యేకంగా.. కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని సోనియా గాంధీ ప్రకటించారు.


వీటితో పాటు సోనియా గాంధీ ప్రకటించిన పథకాల వివరాలు..


మహాలక్ష్మీ పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2 వేల 500 ఆర్థిక సాయం


రూ.500 లకే గ్యాస్ సిలిండర్


ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం


ఇళ్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం


ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల ఇంటి స్థలం


రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం


వ్యవసాయం కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్


గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు


చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పింఛన్


రాజీవ్ ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com