తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. సత్తుపల్లికి చెందిన మృదుల తన ఇద్దరు పిల్లలు ప్రజ్ఞ(5), మహదేవ్(7)లతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. మెుదట పిల్లలను చెరువులో తోసేసి అనంతరం ఆమె కూడా నీటిలోకి దూకేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకి తీయించారు. కాగా, వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.