ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి ఏబీవీపీ డిమాండ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 02:51 PM

వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. కాలేజీ ఫీజుల రియంబర్స్మెంట్ తో పాటు స్కూళ్లు, కాలేజీలో నెలకొన్న సమస్యలపై బుధవారం మధ్యాహ్నం ఆత్మకూర్ గాంధీచౌక్ లో మానవ హారం గా ఏర్పడి నిరసన తెలిపారు. పట్టణంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలుచేయాలనీ, కాలేజీలోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు, జిల్లా లీడర్లు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com