సంగారెడ్డి పటాన్ చెరువు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ శుక్రవారం శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా దుర్గామాల ధరించిన సర్పంచ్ నీలం మధు భక్తిశ్రద్ధలతో అమ్మవారి దీక్షలను పూర్తి చేశారు. దీక్షలు పూర్తయిన సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మండల టిఆర్ఎస్ నాయకులు నారబోయిన శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.