ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ జామ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 07, 2022, 03:20 PM
హైదరాబాద్ నగరం లక్డీకపుల్ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దసరా పండుగ ముగియడంతో ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు జనాలు తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో భారీగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, వాహనాలు చేరుకుంటున్నాయి. మరోవైపు నవరాత్రులు ముగియడంతో హుస్సేన్ సాగర్‎లో నిమజ్జనానికి అమ్మవారి విగ్రహాలు క్యూకట్టాయి. ఈ నేపథ్యంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒకవైపు వర్షం. మరోవైపు ట్రాఫిక్ ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాహనాలు క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com