బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగించే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు
సమాచారం. మరో రెండేళ్లలో లోక్ సభ ఎన్నికలు రాబోతున్న తరుణంలో అప్పటి వరకు జేపీ నడ్డానే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉంచాలని బీజేపీ భావిస్తోంది.
2024 వరకు ఆయనే పార్టీ అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఉంది. 2020లో అమిత్ షా నుంచి జేపీ నడ్డా బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు.