చాకలి (చిట్యాల) ఐలమ్మ 127వ జయంతి వేడుకలను రవీంద్రభారతిలో ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. వేడుకల్లో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ యాదవ్, పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు. ఐలమ్మ స్ఫూర్తితోనే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపారని మంత్రి గంగుల తెలిపారు. ఐలమ్మ చావు కోసం రివార్డు ప్రకటించిన చోటనే,జయంతి వేడుకలను జరుపుకోవడం కేవలం తెలంగాణకే సాధ్యమని తెలిపారు.