ముందస్తు ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో సీట్ల కోసం అధికార, విపక్ష పార్టీలో పోటీ ఎక్కువైంది. సిట్టింగులు మరో అవకాశం కోసం, ఆశావహులు ఒక్క ఛాన్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఆశావహుల్లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కూడా ఉండగా, వారసుల ఎంట్రీ కోసం సీనియర్లు ప్రణాళికలు వేస్తున్నారు. ముఖ్యంగా మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో టిక్కెట్ల కేటాయింపు పార్టీలకు సవాల్ గా మారనున్నట్లు టాక్.