తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో బాధ్యతలు నిర్వర్తిస్తోన్న 48 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు జాబితాను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన శుక్రవారం విడుదల చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ఆదివారం రవీంద్ర భారతిలో జరిగే 'ఉపాధ్యాయ దినోత్సవం' కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. పలు కేటగిరీల కింద ఉత్తమ ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ ఎంపిక చేసినట్టు దేవసేన వెల్లడించారు.