గత నంది అవార్డుల్లో తనకు అన్యాయం జరిగిందని ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. గుంటూరులో నంది నాటకోత్సవాల కార్యక్రమంలో మాట్లాడారు. ఆర్టిస్టుగా, డైరెక్టర్ గా, రైటర్ గా తనకు కనీసం 15 నంది అవార్డులు రావాల్సిందన్నారు. ఒక అవార్డు వచ్చినా అది క్యాన్సిల్ అయిందన్నారు. ఈసారి నంది నాటకోత్సవాలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, 27 మంది సభ్యులతో జ్యూరీ కమిటీ వేశామని వెల్లడించారు.