బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్, లవ్, ఎమోషనల్ మూవీ ‘యానిమల్’. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్తో ఆకట్టుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 1న ఆడియన్స్ ముందుకి రానుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. ప్రస్తుతం టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ షోలకు ఇప్పటికే మంచి కలెక్షన్లు వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఇటీవలే చాలా ఏరియాల్లో ఓపెన్ కాగా ప్రస్తుతం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ట్రైలర్తో యానిమల్పై అందరిలో భారీ అంచనాలు నెలకొనడంతో సినిమా తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.