మణిరత్నం డైరెక్షన్లో రూపొందుతున్న "పొన్నియన్ సెల్వన్" సినిమా యొక్క మొదటి భాగం గతేడాది సెప్టెంబర్ లో విడుదలై, ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రెండవ భాగం వచ్చే నెల 28వ తేదీన విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసారు. మార్చి 20 సాయంత్రం ఆరు గంటలకు 'ఆగనందే' అనే బ్యూటిఫుల్ లవ్ మెలోడీ పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
చియాన్ విక్రం, ఐశ్వర్య రాయ్, త్రిష, కార్తీ, జయం రవి ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.