క్రేజీ హీరోయిన్ సమంత నుండి రాబోతున్న మరొక పాన్ ఇండియా మూవీ "శాకుంతలం". గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో దేవ్ పటేల్, మోహన్ బాబు, అల్లు అర్హ కీరోల్స్ లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 14వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి చిత్రబృందం ఒక్కొక్క కీలకపాత్రని ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా శకుంతల ప్రాణస్నేహితులైన ప్రియంవద, అనసూయల క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రియంవద పాత్రను అదితి బాలన్, అనసూయ పాత్రను అనన్య నాగళ్ళ పోషిస్తున్నారు.