సమంత ప్రధాన పాత్రలో, దర్శకద్వయం హరి శంకర్, హరీష్ నారాయణ్ తెరకెక్కించిన చిత్రం "యశోద". పాన్ ఇండియా భాషల్లో గతేడాది థియేటర్లలో విడుదలైన యశోదకు అన్ని ప్రాంతాల ప్రజల నుండి డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఆపై డిజిటల్ లో కూడా మంచి హిట్ టాక్ సంపాదించుకున్న యశోద తాజాగా బుల్లితెరపై సందడి చేసేందుకు, బుల్లితెర ప్రేక్షకుల మెప్పును పొందేందుకు సిద్ధమయ్యింది. ఈ ఆదివారం సాయంత్రం ఆరున్నరకు ఈటీవీ ఛానెల్ లో యశోద వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది.
వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీశర్మ, సంపత్ రాజ్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు.