మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన కొత్త సినిమా "వాల్తేరు వీరయ్య". బాబీ డైరెక్షన్లో మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో మాస్ రాజా రవితేజ గారు ప్రత్యేక పాత్రలో నటించారు.
భారీ అంచనాల నడుమ ఈ రోజే వాల్తేరు వీరయ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మెగా మాస్ ఫోర్స్ ఒకేసారి తుఫానులా వెండితెరపైకి దూసుకురావడంతో ఇరు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లు మెగా మాస్ పూనకాలతో దద్దరిల్లిపోతున్నాయి. ఆంధ్ర తెలంగాణాలలో మొత్తంగా 865కి పైగా థియేటర్లలో విడుదలైన వాల్తేరు వీరయ్యకి ప్రీమియర్స్, ఎర్లీ షోస్ నుండి పాజిటివ్ రిపోర్ట్ లు వస్తున్నాయి.
శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ సింహ, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, శ్రీనివాస రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ కీరోల్స్ ప్లే చేసారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.