బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనుంది. రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ఈ భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందే ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకునే ప్లాన్ ఉన్నారు. ఇందుకోసం జాన్వీ కపూర్ ను సంప్రదిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు పుష్ప2 లో ప్రత్యేక పాట కోసం కూడా జాన్వీ పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.