కన్నడలో సూపర్ హిట్ ఐన "కాంతార" తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతున్న విషయం తెలిసిందే. కాంతార తెలుగు డబ్బింగ్ హక్కులను కొనుక్కుని, చేతినిండా లాభాలను గడిస్తున్నారు టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ గారు. కాంతార డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టి తో ఒక సినిమాను చేస్తానని మీడియా సుముఖంగా చెప్పారు. అందుకు రిషబ్ శెట్టి కూడా అంగీకరించారు.
తాజా సమాచారం ప్రకారం, అల్లు అరవింద్, రిషబ్ శెట్టి మధ్య జరిగిన కథా చర్చలలో ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేమంటే, మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ఒక అమేజింగ్ స్టోరీని రిషబ్ అల్లు అరవింద్ గారికి వినిపించారట. RRR ప్రమోషన్స్ నిమిత్తం ప్రస్తుతం జపాన్ లో ఉన్న చెర్రీ తిరిగి ఇండియా రాగానే ఆయనకు కథ వినిపించి, ఫైనలైజ్ చేసుకొనే ప్లాన్స్ లో ఉన్నారట అల్లు అరవింద్ గారు.
శంకర్ డైరెక్షన్లో చేస్తున్న RC 15 తప్పించి చెర్రీ ఖాతాలో ఎలాంటి న్యూ ప్రాజెక్ట్స్ లేవు. జెర్సీ డైరెక్టర్ తో సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. సో, చెర్రీ రిషబ్ చెప్పే స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అన్ని కుదిరితే, RC 15 తదుపరి చెర్రీ - రిషబ్ - అల్లు అరవింద్ కాంబోలో సినిమా రావచ్చేమో..!!