లైగర్ డిజాస్టర్ తో ముంబైలోని లక్జరీ అపార్ట్మెంట్ ను ఖాళీ చేసిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లేటెస్ట్ గా గోవాకు తన మకాం ను మార్చినట్టు తెలుస్తుంది. పూరి అండ్ టీం గోవాలో సేద తీరుతూ, ప్రశాంతమైన వాతావరణంలో కొత్త స్క్రిప్ట్ ను రచించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ ఇంకా విడుదల కాకముందే తన కలల ప్రాజెక్ట్ JGM ను ఎంతో గ్రాండ్ గా ఎనౌన్స్ చేసి, ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసారు పూరి. లైగర్ అట్టర్ ఫ్లాప్ తో పూరీకి విజయ్ హ్యాండిచ్చాడని అంటున్నారు. సో, తన కలను నెరవేర్చే హీరో కోసం పూరి వెతుకుతున్నారని టాక్. అలానే JGM స్క్రిప్ట్ పై మరింత శ్రద్ధ పెట్టి ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నారట.
చూడాలి మరి, పూరి - విజయ్ కాంబోలో JGM వస్తుందా? లేక మరో హీరోతో వస్తుందా? అనేది.