సల్మాన్ ఖాన్, పూజాహెగ్డే జంటగా బాలీవుడ్లో "కబీఈద్ కభీ దివాళి" అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతుంది. ముంబైలో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం గత కొన్ని రోజుల నుండి హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉంటున్న సల్మాన్ టాలీవుడ్ లో ఉన్న తన మిత్రులందరిని కలుసుకుంటూ రోజూ వార్తల్లో నిలుస్తున్నాడు. మొన్నీమధ్య మెగాస్టార్ ఇంట రెండుసార్లు సందడి చేసిన సల్లూభాయ్, తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట సందడి చేసారు. ఐతే, ఈ సారి సింగిల్ గా కాదు, కబీ ఈద్ కభీ దివాళి మూవీ టీం తో కలిసి. ఈ మేరకు రామ్ చరణ్, ఉపాసనలు తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో సల్మాన్ ఖాన్, పూజాహెగ్డే, విక్టరీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నట్టు తెలుస్తుంది. పార్టీ అనంతరం చెర్రీ, ఉపాసన, పూజా, సల్మాన్, వెంకీలు కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో ఈరోజు తెగ వైరల్ అవుతుంది. అధికారికంగా ప్రకటించనప్పటికీ, కబీ ఈద్ కభీ దివాళి సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా పాలుపంచుకుంటున్నాడని చెర్రీ ఇంట్లో జరిగిన పార్టీతో ధృవీకృతమైంది.