తానొక బాలీవుడ్ నటుడినని, ప్రాంతీయ సినిమాల్లో నటించటం తనకిష్టం లేదని, అలా చేస్తే తన ఇమేజ్ డామేజ్ అవుతుందని .... బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం కొన్నాళ్ల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. దీంతో సోషల్ మీడియాలో జాన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ విషయం పక్కనపెడితే, తాజాగా జాన్ అబ్రహం ఒక సౌత్ హిట్ మూవీ రీమేక్ హక్కులను కొనుక్కున్నాడు. మలయాళంలో పృథ్విరాజ్ డైరెక్షన్ చేసి హీరోగా నటించిన "అయ్యప్పనం కోషియం" సినిమా అది. ఆ సినిమాను తెలుగులో "భీమ్లానాయక్" పేరుతో పవన్ కళ్యాణ్, రానా రీమేక్ చెయ్యగా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడిదే సినిమాను హిందీలో రీమేక్ చెయ్యాలని జాన్ అబ్రహం అనుకుంటున్నాడట. ఆ సినిమాకు ఫేమస్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వం చెయ్యనున్నారట. ఈ అక్టోబర్ నుండి షూటింగ్ కూడా స్టార్ట్ చెయ్యబోతున్నారట. దీంతో మరోసారి కండల వీరుడు ట్రోలర్ల చేతికి గట్టిగా చిక్కాడు. ఒకప్పుడు సౌత్ సినిమాలలో నటించనని అన్నావ్... మరిప్పుడు సౌత్ సినిమాను ఎలా రీమేక్ చూస్తున్నావ్? నీ ఇమేజ్ డామేజ్ అవ్వదా ? అంటూ సోషల్ మీడియాలో జాన్ పై చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది.