సుకుమార్ - అల్లుఅర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతానికి ప్రేక్షకులంతా పుష్ప సీక్వెల్ కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 స్క్రిప్ట్ ఫైనలైజేషన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్న వేళ, ఈ ప్రాజెక్ట్ పై ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
సుకుమార్ ప్లాన్ ప్రకారం, పుష్పను సింగపూర్, ఇండోనేషియా వంటి ఔట్ డోర్ ప్రాంతాల్లో చిత్రీకరించాలి. మొదటి పార్ట్ కోసం సుకుమార్ వేసుకున్న మాస్టర్ ప్లాన్ ను కోవిడ్ మహమ్మారి నాశనం చేసేసింది. దీంతో మేకర్స్ ఇండియాలోనే షూట్ చెయ్యాల్సి వచ్చింది. ఇక రెండో పార్ట్ షూటింగ్ కూడా ఔట్ డోర్ లోనే ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. కానీ కోవిడ్ ఫోర్త్ వేవ్ ముంచుకొస్తుండడంతో ఈసారి కూడా విదేశీ షూటింగ్ కు చెక్ పెట్టాల్సి వచ్చిందట. దీంతో పుష్ప 2 షూటింగ్ మొత్తం ఇండియాలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించి, విజువల్స్ తో సినిమాకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ను తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యబోతున్నాడట. ఇప్పుడు పుష్ప2 టీం మొత్తం పూర్తిగా విజువల్స్ మీదనే ఆధారపడిందన్నమాట.