పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే "లైగర్" సినిమాలో నటిస్తున విషయం అందరికి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరగనుందని సమాచారం. షూట్కి సంబంధించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు. "లైగర్" సినిమా ఆగస్ట్ 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్తో కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.