'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే చిత్రంలో బాలీవుడ్ గ్లామర్ డాల్ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రూ.500 కోట్లతో పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.
ఐతే, ఈ మూవీ షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందని, అందుకు దీపికా అనారోగ్యమే కారణమని ఇలా పలు రకాల వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ పుకార్లన్నిటికీ నిర్మాత అశ్వినీదత్ చెక్ పెట్టినట్టు తెలుస్తుంది. ప్రాజెక్ట్ కే షూట్ సమయంలో దీపికా అనారోగ్యానికి గురి కావడం నిజమేనని, బిపి ఎక్కువవడంతో అసౌకర్యానికి గురైన దీపికా వెంటనే హాస్పిటల్ కు వెళ్లిందని, గంటలోనే పూర్తి ఆరోగ్యంగా తిరిగొచ్చిందని తెలిపారు. ప్రస్తుతం దీపికా ఆరోగ్యంగానే ఉందని, షూటింగ్ లో చురుగ్గా పాల్గొంటుందని అశ్వినీదత్ క్లారిటీ ఇవ్వడంతో ప్రాజెక్ట్ కే షూటింగ్ పై వస్తున్న వదంతులకు శుభం కార్డు పడింది.