కేజీఎఫ్ ఫ్రాంచైజీతో ఒక్కసారిగా దేశవ్యాప్త గుర్తింపును తెచ్చుకుంది హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ. కేజీఎఫ్ 1,2 చిత్రాలను ఎక్కడా రాజీ పడకుండా, భారీ బడ్జెట్టుతో నిర్మించి అంతకంతకూ లాభాలను గడించింది. ఈ క్రేజ్ తో హోంబలే ఫిలిమ్స్ ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలనే నిర్మిస్తోంది. డైరెక్టర్ గా, హీరోగా విజయపధంలో దూసుకుపోతున్న మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ తో చేతులు కలిపి "టైసన్" అనే పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా, తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్లో ఒక ముసలతను బోర్డుపై హీరో పేరును రాస్తూ కనిపిస్తాడు. ఇందులో పృథ్విరాజ్ ఐఏఎస్ ఆఫీసర్ గా నటించబోతున్నారు. ఈ సినిమాకు పృద్విరాజే దర్శకత్వం వహించారు.