దివంగత కోలీవుడ్ స్టార్ యాక్టర్ నడిగర్ తిలగం శివాజీ గణేశన్ కుటుంబం నుంచి మరో వ్యక్తి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లెజెండరీ హీరో మనవడు ధర్సన్ గణేశన్ త్వరలో హీరోగా పరిచయం కాబోతున్నట్లు సమాచారం. ధర్సన్ గణేశన్ మరి ఎవరో కాదు శివాజీ గణేశన్ కొడుకు రామ్కుమార్ చిన్న కొడుకు. ధర్సన్ సోదరుడు ధుశ్యంత్ కోలీవుడ్లో నిర్మాత మరియు నటుడు కూడా. ప్రస్తుతానికి ఈ సినిమాపై క్లారిటీ లేదు. అయితే, ధర్సన్ పూణెలో నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.