గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ నటించిన 'జెర్సీ' సినిమా ఏప్రిల్ 22, 2022న విడుదలయింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం మే 20, 2022న తన ప్లాట్ఫారమ్పై విడుదలవుతుందని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దిల్ రాజుతో కలిసి అల్లు అరవింద్, నాగ వంశీ, బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సచేత్ సంగీతం అందించారు. ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాకి తమిళ రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.