రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన కొత్త సినిమా ప్రాజెక్ట్ కే షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ గ్లామర్ డాల్ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రూ.500 కోట్లతో పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ఇటీవల రాధేశ్యామ్ గా ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్, ఈ చిత్రంతో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆయన అభిమానులు ప్రస్తుతం అప్ కమింగ్ ఫిల్మ్స్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ అప్డేట్స్ గురించి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ సినిమాల అప్డేట్స్ విషయంలో మేకర్స్ చాలా ఆలస్యం చేస్తున్నారని చిర్రెత్తిపోతున్నారు. ఇంత ఆలస్యం ఎందుకంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా స్పందించారు. ప్రభాస్ అభిమాని ఒకరు ‘ప్రాజెక్ట్ కే’పై అప్డేట్ కోరుతూ దర్శకుడు నాగ్ అశ్విన్ కు ట్వీట్ చేశారు. ‘హాయ్ నాగ్ అశ్విన్ అన్న.. గుర్తున్నామా?’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు. ఆ ట్వీట్ కు వెంటనే నాగ్ అశ్విన్ స్పందించాడు. రిప్లై ఇస్తూ.. ‘గుర్తున్నారు.. ఇప్పుడే ప్రాజెక్ట్ కే కు సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తైంది. ప్రభాస్ గారి ఇంట్రో బిట్ కూడా కంప్లీట్ అయ్యింది. మీ అభిమాన హీరో చాలా కూల్ గా కనిపిస్తున్నారు. జూన్ చివరి నుంచి తదుపరి షెడ్యూల్ స్టార్ట్ కానుంది. రిలీజ్ ఆర్డర్ లో మనం లాస్ట్ కదా.. తరుచూ అప్డేట్స్ ఇవ్వడానికి సమయం ఉంది. ఈ చిత్రం కోసం అందరం ప్రాణం పెట్టి పని చేస్తున్నాం’ అని బదులిచ్చాడు.