సారిక అనే పేరు చెప్పగానే అందరికీ తెలియకపోవచ్చు. స్టార్ హీరో కమల్ హాసన్ మాజీ భార్యగా, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తల్లిగా ఆమెకు ఎంతో పేరుంది. ఎంతో ఉన్నత కుటుంబానికి చెందిన ఆమెకు కూడా లాక్డౌన్లో కష్టాలు తప్పలేదు. రూ.3 వేల కోసం థియేటర్లో పని చేసినట్లు ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. విడాకుల తర్వాత ముంబైకి వెళ్లి సినిమాలు, థియేటర్లలో నటిస్తున్న సారిక ఇటీవల కొంత విరామం తీసుకుంది. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో కీలక విషయాలు వెల్లడించింది. లాక్డౌన్ సమయంలో తన వద్ద డబ్బు అయిపోయిందని, థియేటర్ ఆర్టిస్టుగా రూ.2000 నుంచి రూ.2700 వరకు ఇస్తామని చెబితే అలా పని చేసినట్లు ఆమె చెప్పారు.
సారిక ఠాకూర్ ప్రస్తుతం అలంకృత శ్రీవాస్తవ దర్శకత్వంలో రూపొందుతున్న అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్లో 'మై బ్యూటిఫుల్ రింకిల్స్'లో నటిస్తోంది. ఆమె 60 ఏళ్ల వృద్ధురాలి పాత్రను పోషిస్తుంది. ఆ వయసులో యువకుడితో ప్రేమ సన్నివేశాల్లో నటించనుంది. ఈ సిరీస్ మే 13 నుండి ప్రసారం అవుతుంది. కెరీర్ పీక్స్లో ఉండగా కమల్ హాసన్ని పెళ్లి చేసుకుని చెన్నైకి వెళ్లిపోయింది. అప్పుడు నటనకు స్వస్తి చెప్పింది. 2000 మధ్యలో ఆమె భేజా ఫ్రై, మనోరమ సిక్స్ ఫీట్ అండర్, పర్జానియా వంటి ఎన్నో చిత్రాలతో తిరిగి నటించింది. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన యుద్ అనే సిరీస్లో సారిక తన టీవీ షోలలో ప్రవేశించింది.