పరశురామ్ డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా మే 12న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో సముద్రఖని, నదియా, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. మహేష్ యూరప్లో హాలిడేలో ఉండగా అయన తిరిగి వచ్చిన తర్వాత ప్రమోషన్లను ప్రారంభించనున్నాడు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, 'సర్కారు వారి పాట' సినిమా 163 నిమిషాల (2 గంటల 43 నిమిషాలు) రన్ టైమ్ ని కలిగి ఉంది. బ్యాంకింగ్ స్కామ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ 'సర్కారు వారి పాట' సినిమాని నిర్మిస్తున్నాయి.