తెలుగు ప్రేక్షకులకి సుమ కనకాల గురించి పరిచయం అవసరం లేదు. ప్రముఖ హోస్ట్, యాంకర్ సుమ కనకాల 'జయమ్మ పంచాయతీ' అనే సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో రానున్న ఈ సినిమా మే 6, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈరోజు ఉదయం 10:08 గంటలకు జయమ్మ పంచాయతీ రిలీజ్ ట్రైలర్ ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్టర్ని పోస్ట్ చేసి ప్రకటించారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.