మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా మే 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మే 2న ట్రైలర్ ను విడుదల చేశారు. ఇప్పుడు ఈ ట్రైలర్ యూట్యూబ్ను షేక్ చేస్తోంది. విడుదలైన 19 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. యూట్యూబ్లో నెం.1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. అంతకుముందు 'రాధేశ్యామ్'(24 గంటల్లో 23.20 మిలియన్ వ్యూస్) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టింది. దీంతో రాధేశ్యామ్ రెండో స్థానానికి పడిపోయింది. ఆచార్య(21.86), బాహుబలి 2(21.81), ఆర్ఆర్ఆర్(20.45), కేజీఎఫ్-2 తెలుగు డబ్(19.38) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 7న హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో నిర్వహిస్తారని సమాచారం. చీఫ్ గెస్ట్గా ఎవరు రాబోతున్నారో ఇంకా వివరాలు తెలియలేదు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించారు