గుజరాత్ : భారత్ పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇవాళ అహ్మదాబాద్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎయిర్పోర్టులో బెంజమిన్ నెతన్యాహు దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం మోదీ బెంజమిన్తో కలిసి సబర్మతి ఆశ్రమానికి వెళ్లే రహదారి వెంబడి రోడ్ షోలో పాల్గొన్నారు. ఇరు దేశాల ప్రధానులను చూసేందుకు ప్రజలు రోడ్డుకిరువైపులా బారులు తీరారు. రోడ్ షోలో ప్రధాని ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు.