ఆగ్రా: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ దంపతులు ఇవాళ ప్రేమ సౌధం తాజ్మహల్ను సందర్శించారు. ఢిల్లీ నుంచి ఆగ్రా చేరుకున్న నెతన్యహూ దంపతులకు ఆ రాష్ట్ర సీఎం యోగిఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. నెతన్యహూ దంపతుల రాక సందర్భంగా ఇవాళ రెండు గంటల పాటు తాజ్మహల్లో టూరిస్టులను అనుమతించలేదు. తాజ్మహల్ ముందు ఉన్న పాలరాతి బెంచ్పై నెతన్యహూ, ఆయన భార్య నిలుచుని ఫోటో దిగారు. రేపు జరిగే ఓ కార్యక్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ.. మోదీకి ఓ గిఫ్ట్ ఇవ్వనున్నారు. ఇటీవల ఇజ్రాయెల్ వెళ్లినప్పుడు గాల్ మొబైల్ వాటర్ జీప్లో ఇద్దరూ తిరిగారు. అయితే ఆ జీపును ఇప్పుడు మోదీకి నెతన్యహూ బహుమతిగా ఇవ్వనున్నారు. ఆ బగ్జీ జీపు ఖరీదు సుమారు 75 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నీటి శుద్ధి కోసం ఈ వాహనాన్ని వాడనున్నారు. సహజ విపత్తులు వచ్చినప్పుడు దీన్ని ఎక్కువగా వాడే అవకాశాలున్నాయి.