ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాజ్‌మహల్‌ను సందర్శించిన ఇజ్రాయెల్ ప్రధాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 16, 2018, 04:11 PM

ఆగ్రా: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ దంపతులు ఇవాళ ప్రేమ సౌధం తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఢిల్లీ నుంచి ఆగ్రా చేరుకున్న నెతన్యహూ దంపతులకు ఆ రాష్ట్ర సీఎం యోగిఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. నెతన్యహూ దంపతుల రాక సందర్భంగా ఇవాళ రెండు గంటల పాటు తాజ్‌మహల్‌లో టూరిస్టులను అనుమతించలేదు. తాజ్‌మహల్ ముందు ఉన్న పాలరాతి బెంచ్‌పై నెతన్యహూ, ఆయన భార్య నిలుచుని ఫోటో దిగారు. రేపు జరిగే ఓ కార్యక్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ.. మోదీకి ఓ గిఫ్ట్ ఇవ్వనున్నారు. ఇటీవల ఇజ్రాయెల్ వెళ్లినప్పుడు గాల్ మొబైల్ వాటర్ జీప్‌లో ఇద్దరూ తిరిగారు. అయితే ఆ జీపును ఇప్పుడు మోదీకి నెతన్యహూ బహుమతిగా ఇవ్వనున్నారు. ఆ బగ్జీ జీపు ఖరీదు సుమారు 75 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నీటి శుద్ధి కోసం ఈ వాహనాన్ని వాడనున్నారు. సహజ విపత్తులు వచ్చినప్పుడు దీన్ని ఎక్కువగా వాడే అవకాశాలున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com