న్యూఢిల్లి : సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తొలిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నివాసంలో సీనియర్ జడ్జిల కీలక సమావేశం జరుగనున్నది. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జస్టిస్ చలమేశ్వర్ సహా నలుగురు న్యాయమూర్తులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. హైకోర్టులు, సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలపై ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సందర్భంలో న్యాయమూర్తులు తొలిసారి మీడియాతో మాట్లాడనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.