ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వల్ల జింబాబ్వే ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో కరెన్సీగా అమెరికా డాలర్లను వినియోగించాలని భావిస్తోంది. ఇక నాణేలను 22 క్యారెట్ల బంగారం 31.10 గ్రాముల బరువుతో రూపొందించనుంది. జింబాబ్వే కరెన్సీతో పాటు విదేశీ కరెన్సీలను చెల్లించి ఆ కాయిన్లను కొనుగోలు చేయొచ్చు. నగదు కొరతను అరికట్టేందుకు ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.