జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం కొండపా పాయపల్లి గ్రామంలో జూదం ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ. 55, 250 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.
గురువారం సాయంత్రం కొండపాపాయపల్లె గ్రామ శివారులో జూదమాడుతున్నట్లు సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి నిర్వహించి జూదరులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.