నంద్యాల జిల్లా సిరివెళ్ల మండల పరిధిలోని ఆయా గ్రామాలలో గల జగనన్న కాలనీలలోని లబ్ధిదారులు పక్కా గృహాల నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని ఎంపీడీవో ఉమామహేశ్వర రావు పిలుపునిచ్చారు.
మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఈవో సుబ్బరాయుడు సర్పంచ్ సాలమ్మ అధ్యక్షతన గురువారం సమావేశం నిర్వహించారు. ఇసుక కంకర కడ్డీ తదితర నిర్మాణ సామాగ్రి తో పాటు సకాలంలో బిల్లులు మంజూరు అవుతాయని అధికార బృందం లబ్ధిదారులకు సూచించారు.