న్యూఢిల్లీ : గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ర్టాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. గుజరాత్లో 182 స్థానాలకు గానూ బీజేపీ 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హిమాచల్ప్రదేశ్లో 68 స్థానాలకు గానూ 39 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలకు వచ్చిన ప్రధాని మోదీ విజయ సంకేతం చూపారు. పార్లమెంట్ భవనం లోపలికి వెళ్లే ముందు అక్కడున్న వారికి అభివాదం చేస్తూ మీడియాకు విజయ సంకేతం చూపిన మోదీ అనంతరం ఆయన నవ్వుతూ వెళ్లిపోయారు. ఇక ఢిల్లీ బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.